Home తెలుగు News సినిమా రాజమౌళి, బోయపాటిలతో సినిమాలెప్పుడని ప్రశ్నించిన రిపోర్టర్ … దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన బాలయ్య

రాజమౌళి, బోయపాటిలతో సినిమాలెప్పుడని ప్రశ్నించిన రిపోర్టర్ … దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన బాలయ్య

0
రాజమౌళి, బోయపాటిలతో సినిమాలెప్పుడని ప్రశ్నించిన రిపోర్టర్ … దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన బాలయ్య

[ad_1]

రీసెంట్‌గా రిలీజైన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన నంద‌మూరి బాల‌కృష్ణ త‌దుప‌రి సినిమాను గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాల్సిన గ్యాప్‌లో టాక్ షో అన్‌స్టాప‌బుల్‌ను నాన్ స్టాప్‌గా పూర్తి చేసేస్తున్నారు బాల‌కృష్ణ‌. అలాగే అఖండ స‌క్సెస్‌ను బాల‌య్య తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డితో క‌లిసి బాల‌కృష్ణ దేవాల‌యాల‌ను సంద‌ర్శించారు కూడా. అలా దేవాల‌యాల‌ను సంద‌ర్శించే స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చోటు చేసుకుంది. అదేంటంటే.. తిరుమ‌ల శ్రీవారి సంద‌ర్శ‌నార్థం బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను, మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి వెళ్లిన‌ప్పుడు అక్క‌డున్న లోక‌ల్ మీడియా రిపోర్టర్ బాల‌కృష్ణ‌ను ఓ ప్ర‌శ్న వేశారు. సాధార‌ణంగా కొన్ని విష‌యాల‌కు ఆయ‌న రియాక్ష‌న్ మ‌రో రేంజ్‌లో ఉంటుంది. అలాంటి ప్ర‌శ్న విన‌గానే బాల‌య్య‌కు తెలియ‌ని కోపం వ‌చ్చేసింది. అయితే ఆయ‌న దాన్ని బ‌య‌ట‌ప‌డ‌నీయ‌లేదు. చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించారు.

అస‌లు బాల‌కృష్ణ‌కు కోపం తెప్పించేలా స‌ద‌రు లోక‌ల్ రిపోర్ట‌ర్ ఏమ‌ని ప్ర‌శ్నించారంటే.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఎప్పుడు చేస్తార‌ని, అలాగే బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త‌దుప‌రి సినిమా ఎప్పుడు ఉంటుందని? ఆ రెండు ప్ర‌శ్న‌లు వేయ‌గానే బాల‌కృష్ణ‌కు చిరు కోపం వ‌చ్చేసింది. అయినా ఆయ‌న దాన్ని బ‌య‌ట‌ప‌డనీయ‌కుండా మౌనంగా ఉండిపోయారు. దానికి కూడా స‌ద‌రు రిపోర్ట్ మౌనం అర్థాంగీకారం అని అనుకోవ‌చ్చునా? అని ప్ర‌శ్నించారు. దానికి బాల‌య్య స‌మాధానం ఇస్తూ.. అర్ధాంగీకారం కాదు.. అప్ర‌స్తుతం అని స‌మాధానం ఇచ్చారు. అంటే ఇప్పుడు అడ‌గాల్సిన ప్ర‌శ్న‌లు ఇవి కావు.. అని స‌మాధానం వ‌చ్చేలా బాల‌కృష్ణ చాలా షార్ప్‌గా ఆన‌ర్స్ ఇచ్చారు. దీంతో ఖంగు తిన‌డం స‌ద‌రు రిపోర్ట‌ర్ వంతైంది.

సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అఖండ సినిమా బాల‌కృష్ణ కెరీర్‌లోనే టాప్ చిత్రంగా నిలిచింది. ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అలాగే ఓవ‌ర్ సీస్‌లోనూ వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూళు చేసింది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here