[ad_1]
అసలు బాలకృష్ణకు కోపం తెప్పించేలా సదరు లోకల్ రిపోర్టర్ ఏమని ప్రశ్నించారంటే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఎప్పుడు చేస్తారని, అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుందని? ఆ రెండు ప్రశ్నలు వేయగానే బాలకృష్ణకు చిరు కోపం వచ్చేసింది. అయినా ఆయన దాన్ని బయటపడనీయకుండా మౌనంగా ఉండిపోయారు. దానికి కూడా సదరు రిపోర్ట్ మౌనం అర్థాంగీకారం అని అనుకోవచ్చునా? అని ప్రశ్నించారు. దానికి బాలయ్య సమాధానం ఇస్తూ.. అర్ధాంగీకారం కాదు.. అప్రస్తుతం అని సమాధానం ఇచ్చారు. అంటే ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ఇవి కావు.. అని సమాధానం వచ్చేలా బాలకృష్ణ చాలా షార్ప్గా ఆనర్స్ ఇచ్చారు. దీంతో ఖంగు తినడం సదరు రిపోర్టర్ వంతైంది.
సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే టాప్ చిత్రంగా నిలిచింది. ఏకంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే ఓవర్ సీస్లోనూ వన్ మిలియన్ డాలర్స్ను వసూళు చేసింది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
[ad_2]
Source link