ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదలయ్యాయి. ‘భీమ్లా నాయక్’.. టైటిల్ సాంగ్ను ముందుగా విడుదల చేశారు. దీన్ని మొగిలయ్య పాడారు. ఇక రెండో సాంగ్ ‘అంత ఇష్టమేందయా’.. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రధారిపై నిత్యామీనన్ తన ప్రేమను వ్యక్తం చేసే పాట. ఇక మూడో సాంగ్గా ‘లాల భీమ్లా..’ పాటను విడుదల చేశారు. ఇది హీరోయిజాన్ని తెలియజేసే పాట. దీన్ని రాయడం విశేషం. అన్నీ పాటలకు చాలా మంచి ఆదరణ లభించాయి. ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ అయిన అడవితల్లి విడుదలైంది. నిజానికి ఈ పాటను డిసెంబర్ 1న విడుదల చేద్దామని భావించారు. కానీ సిరివెన్నెల సీతాారామశాస్త్రి మరణంతో పాట విడుదలను ఆపి రెండు రోజులు గ్యాప్ తీసుకుని విడుదల చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ను కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి పాడారు. తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. పవన్ జోడీగా నిత్యామీనన్, రానా జోడీగా సంయుక్తా మీనన్ నటించారు. భీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. , రానా తొలిసారి కలిసి నటిస్తున్నారు.