ప్రధానాంశాలు:
- ఆంధ్రప్రదేశ్కి అండగా టాలీవుడ్
- వరద సాయాలు అందిస్తున్న హీరోలు
- విరాళాలు ప్రకటించిన చిరంజీవి, మహేశ్
‘‘ఆంధ్రప్రదేశ్లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నావంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’’ అని చిరంజీవి తెలిపారు.
‘‘ఆంధ్రప్రదేశ్ వినాశకరమైన వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం నా వంతుగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఇది సంక్షోభ సమయం ఒకరికొకరు అండగా నిలబడాల్సిన తరుణం. అందరూ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్కు సాయం చేయండి’’ అని మహేశ్ అన్నారు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పంట నష్టం.. ఆస్థి నష్టం జరిగిందని, తక్షణ సాయంగా కేంద్ర ప్రభుత్వం కొంత సాయాన్ని అందించాలని వై.ఎస్.జగన్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. అకాల వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోనూ వరదలు ముంచెత్తాయి. ప్రజలకు ఆస్థి, ప్రాణ నష్టం సంభవించాయి. రహదారులు దెబ్బతిన్నాయి. దాదాపు 85 లక్షల హెక్టార్లలోని పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. దాదాపు ఆరువేల కోట్లకు పైగానే వరద నష్టం సంభవించిందని ప్రభుత్వం అంచనా వేసింది.