[ad_1]
ఎఫ్ 2కి సీక్వెల్గా ఎఫ్ 3న ప్లాన్ చేశాడు. ఇది వరకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాదిలోనే ముహూర్తం ఫిక్స్ చేసినా కరోనా రాకతో షూటింగ్ వాయిదా పడింది. సెకండ్ వేవ్ అనంతరం ఈ మూవీ యూనిట్ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ మధ్యే హైద్రాబాద్లో ఓ లాంగ్ షెడ్యూల్ను చిత్రయూనిట్ షూట్ చేసింది.
ఆ షూటింగ్ నేడు పూర్తయిందట. ఈ మేరకు వరుణ్ తేజ్ అసలు విషయాన్ని చెప్పాడు. ఓ లాంగ్ షెడ్యూల్ అద్భుతంగా పూర్తయింది.. త్వరలోనే కొత్త షెడ్యూల్లో మళ్లీ అందరం కలుకుంటామని చెప్పుకొచ్చాడు. అలా వరుణ్ తేజ్ వెంకటేష్ ఇద్దరూ కూడా బాల్కనీలో ముచ్చట్లు పెడుతున్న ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి ఎఫ్ 2 మ్యాజిక్ను మళ్లీ రిపీట్ చేసేందుకు ఈ సారి సునీల్, సోనాల్ చౌహాన్ వంటి వారిని అనిల్ రావిపూడి లైన్లోకి తీసుకున్నాడు.
[ad_2]
Source link