నేచురల్ స్టార్ చేతుల మీదుగా సినిమాలోని మొదటి పాటను విడుదల చేయించారు. జయమ్మ పంచాయితీలోని ఫస్ట్ సింగిల్ తిప్పగలనా? అనే పాటను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులకు ఈ పాట నచ్చుతుంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.
ఈ పాటలో ఊరు, ఊరిలో పూజారి, ఆ పూాాజారి ప్రేమ కథ కనిపిస్తోంది. ఆ పూజారికి, జయమ్మకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రేమ కథకు జయమ్మకు ఏమైనా సంబంధం ఉంటుందా? అనేట్టుగా ఈ పాటగా సాగింది. కీరవాణి మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. అనుష్ కుమార్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు.