[ad_1]
ఇందులో ఆయన చేతిపై బాస్కెట్ బాల్ను తిప్పడం వంటి పనులు చేసి అమితాబ్ను ఆశర్యపరిచారు. అలాగే తన సిక్స్ ప్యాక్ దేహాన్ని కూడా ఓపెన్గా అందరి ముందు చూపించారు. అందరూ గట్టిగా అరిచినప్పుడు అందరూ అమ్మాయిలే అరుస్తున్నారు అంటూ అమితాబ్ చమత్కరించారు. అలాగే ధూమ్ సినిమా సమయంలో బైక్ వేసుకుని అమితాబ్ ఇంటికి వెళ్లిప్పుడు.. ఈ బైక్ విషయాల్లో అభిషేక్ను ఎంకరేజ్ చేయకు అంటూ అమితాబ్ జాన్ అబ్రహంతో చెబుతున్న సమయంలో అభిషేక్ కిందకు వచ్చి బైక్ చాలా బావుందనడం, అప్పుడు అమితాబ్ మాట మార్చేయడం .. వంటి విషయాలను జాన్ అబ్రహం అమితాబ్కు గుర్తు చేయగా ఆయన నవ్వుకున్నారు. తర్వాత ఏదో విషయాన్ని చెబుతున్న సమయంలో జాన్ అబ్రహం స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు జాన్ అబ్రహం ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారనే సంగతి తెలియాలంటే శుక్రవారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.
మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ‘’ నవంబర్ 25న విడుదలైంది. సమస్యలపై పోరాడే రైతు కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. దివ్యా ఖోస్లా కుమార్ హీరోయిన్గా నటించింది.
[ad_2]
Source link