Home తెలుగు News సినిమా mahesh babu: NTR : ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు.. ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, మహేశ్.. మధ్యలో పవన్ కళ్యాణ్ – pawan kalyan, mahesh babu and ntr in single frame at evaru meelo koteeswarulu

mahesh babu: NTR : ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు.. ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, మహేశ్.. మధ్యలో పవన్ కళ్యాణ్ – pawan kalyan, mahesh babu and ntr in single frame at evaru meelo koteeswarulu

0
mahesh babu: NTR : ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు.. ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, మహేశ్.. మధ్యలో పవన్ కళ్యాణ్ – pawan kalyan, mahesh babu and ntr in single frame at evaru meelo koteeswarulu

[ad_1]

ప్రధానాంశాలు:

  • పవన్, మహేశ్, ఎన్టీఆర్ ఒకే ఫ్రేములో
  • ఎవరు మీలో కోటీశ్వరులు చివరి ఎపిసోడ్‌లో సెలబ్రిటీల సందడి
  • ప్యాన్స్‌కు పండగే

త్రిమూర్తుల‌ను చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోతాయా? క‌చ్చితంగా స‌రిపోవు. ఇక్కడ మ‌నం ప్ర‌స్తావించ‌బోయేది సృష్టిక‌ర్త‌లు గురించి కాదు.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి మూలాధారంగా నిలుస్తూ త‌మ సినిమాల‌తో అభిమానుల‌ను ఎంటైర్ చేస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు గురించి. ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవ‌రో కాదు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఈ ముగ్గురు ఒకే ఫ్రేములోక‌నిపిస్తే ఎలా ఉంటుంది? అభిమానుల‌కు పెద్ద పండ‌గే. త్వ‌ర‌లోనే అభిమానుల కోరిక తీర‌బోతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేశ్‌, ఎన్టీఆర్ ఓ ఫ్రేములో క‌నిపించి అభిమానుల‌కు ఆనందాన్ని పంచ‌బోతున్నారు. ఇంత‌కీ సినిమాల్లో కాదండోయ్‌. బుల్లితెర ఫ్రేమ్‌పై వీరి ముగ్గురు క‌నిపించ‌బోతున్నార‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అస‌లు విష‌యంలోకి వెళితే, ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న షో ‘ఎవరు మీలో కోటీశ్వ‌రులు’. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సెల‌బ్రిటీల విష‌యానికి వ‌స్తే, ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌, కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, స‌మంత వంటి వారు పాల్గొన్నారు. అస‌లు షో ప్రారంభం కావ‌డ‌మే రామ్‌చ‌ర‌ణ్‌తోనే ప్రారంభ‌మైంది. RRR సినిమాలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించ‌డం వ‌ల్ల ఏర్ప‌డిన రిలేష‌న్‌తో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి చ‌ర‌ణ్ తొలి అతిథిగా వ‌చ్చేసి పాతిక ల‌క్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్నారు. ఈ సెల‌బ్రిటీల లిస్టులో మ‌హేశ్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా ఎప్పుడో పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ ఎపిసోడ్ జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోతుంది. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ లిస్టులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చేరార‌నే వార్త‌లు రావ‌డం కొస‌మెరుపు.

ఎన్టీఆర్ అడిగిన ఏదో ప్ర‌శ్న‌కు మ‌హేశ్ ఫోన్ ఎ ఫ్రెండ్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కాల్ చేయ‌గా ఆయ‌న స‌పోర్ట్ చేశార‌నేది విష‌యం. కానీ నెట్టింట వినిపిస్తోన్న ఈ వార్త‌ల్లో మ‌రిందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒక‌వేల నిజ‌మైతే మాత్రం అభిమానుల ఆనందానికి తిరుగుండ‌దు. అదే జ‌రిగితే, క‌చ్చితంగా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రామ్ బుల్లితెర టి.ఆర్‌.పి రేటింగుల‌ను బ్రేక్ చేస్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. బిగ్‌బాస్ తొలి సీజ‌న్ త‌ర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రెండో బుల్లితెర ప్రోగామ్ ఇది. ఆట నాది..కోటి మీది అంటూ మ‌రోసారి ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో షోకు గ్లామ‌ర్‌ను తెచ్చారు. రీసెంట్‌గా రాజా రవీంద్ర అనే పోలీస్ ఆఫీస‌ర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని కోటీ రూపాయ‌ల‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here