ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఆనంద్ భారతి.. ప్రకాష్ రాజ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘నేను కెరియర్ మొదలుపెట్టినప్పుడు చాలామంది నటీనటులు, విలన్లు పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చేవారు. మన తెలుగులో నటించేవాళ్లు లేరా.. బయటవాళ్లు వచ్చి చేయడానికి మనలో ఏం తక్కువ అనుకునేవాడ్ని.. ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారు కూడా వచ్చారు. బద్రి సినిమాలో మెయిన్ విలన్గా ప్రకాష్ రాజ్ వస్తే.. ఈ మాత్రం మేం చేయలేం అనుకున్నాం.. కానీ రాను రాను తెలిసింది ఏంటంటే.. నిజంగా ఆ పాత్ర మాకు ఇస్తే మేం చేయలేం.. క్యారెక్టర్కి ప్రాణం పోస్తాడు ఆయన.. మనం చేస్తూ చేస్తూ పోతే ఏనాడైనా ప్రకాష్ రాజ్లా మనం చేయవచ్చు.
ప్రకాష్ రాజ్ గారు లొకేషన్లో ఉంటే అందరితో బాగా మాట్లాడతారు. బద్రి సినిమా అప్పటి నుంచి తెలుసు కాబట్టి.. సెట్లో కనిపిస్తే ఏరా ఎలా ఉన్నారు.. ఇంట్లో వాళ్లంతా బాగున్నారా? ప్రాబ్లమ్ ఏం లేదుకదా అని అడుగుతారు. ఆయన దగ్గర మేం ఏం సాయం తీసుకోలేదు కానీ.. ఆయనకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ.. వాళ్ల అసిస్టెంట్స్కి మణికొండలో డూప్లెక్స్ హౌస్లు కట్టిచ్చారు. ఈరోజుల్లో అలాంటి సాయం ఎవరు చేస్తారు.. అది ఆయన గొప్పతనం’ అంటూ ప్రశంసలు కురిపించారు ఆనంద్ భారతి.
విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎవడు, ఎక్స్ ప్రెస్ రాజా, గోలీమార్, దుబాయ్ శ్రీను, అతడు, నువ్వు నాకు నచ్చావ్, కిక్, బద్రి తదితర చిత్రాల్లో నటించాడు ఆనంద్ భారతి.