ప్రధానాంశాలు:
- కేటీఆర్ ట్వీట్కు సామ్ రిప్లయ్
- ఘాటుగా నెటిజన్ రిప్లయ్
- షాక్లో అభిమానులు
750 మంది మరణించిన రైతులకు రూ.3 లక్షలు ఇవ్వబోతున్నట్లు KCR ప్రకటించడంపై TRS పార్టీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. KCR తనయుడు, తెలంగాణ మంత్రి KTR ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. దీనికి సమంత నమస్కారం గుర్తుని రిప్లయ్గా పంపింది. ఇప్పుడదే ఆమెకు సమస్యగా మారింది. కొందరు నెటిజన్స్ సమంత తీరుని తప్పు పడుతున్నారు. ‘‘ఆ 763 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది కొత్త వ్యవసాయ చట్టాల గురించే అని ఎవరు చెప్పారు? వాళ్లకు 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రజలు తమ సొమ్మును ఎందుకు పరిహారంగా చెల్లించాలి..? కాస్త tweet చేసేముందు వెనుక ముందు చూస్కోండి. తెలంగాణ లో రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భీమా తప్పితే రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చదు. ఎక్కడో వేరే రాష్ట్రం లో చనిపోతే మనం డబ్బులు ఇవ్వలా? మన సార్ భాషలో చెప్పాలంటే తల్లికి కూడు పెట్టానోడు పినతల్లికి గాజులు ఇస్తాడంట!’’ అని ఓ నెటిజన్ సమంతకు రిప్లయ్గా ఘాటు రియాక్షన్ ఇచ్చాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది. రెండు ద్విభాషా చిత్రాలను చేస్తుండటంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పుష్ప ది రైజ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లోనూ చేయనుంది. ఇది కాకుండా త్వరలోనే బాలీవుడ్లోనూ ఓ సినిమా చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.