సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు రాసిన సిరివెన్నెల మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు సెలబ్రిటీలు.