ప్రధానాంశాలు:
- శరవేగంగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్
- మ్యూజిక్పై హైప్ పెంచుతున్న తమన్
- లేటెస్ట్ పోస్ట్ వైరల్
రీసెంట్గా ‘సర్కారు వారి పాట’ ట్యూన్ కంపోజ్ చేస్తున్న వీడియోను పంచుకొని సినిమా పాటలపై ఆతృత పెంచేసిన తమన్.. తాజాగా ”డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్” అంటూ మరో పోస్ట్ పెట్టారు. దీన్నిబట్టి చూస్తుంటే అతి త్వరలో ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోందని అర్థమవుతోంది. దీపావళి కానుకగా ఈ సాంగ్ విడుదల కావొచ్చనే టాక్ నడుస్తోంది. ఇక తమన్ పోస్ట్ చేస్తున్న ఈ అప్డేట్స్ చూస్తుంటే ఈ సాంగ్ దుమ్ము దుమారం రేపడం ఖాయమే అనిపిస్తోంది.
మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమాగా రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ బాణీలు కడుతుండగా.. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలోని ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో జరిపారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్లో చేస్తున్నారు. అక్కడి అందమైన లొకేషన్స్లో మహేష్ కీర్తి పై సాంగ్స్ చిత్రీకరణ జరుగుతోంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.