[ad_1]
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ.. ఈవెంట్కు వచ్చినందుకు బన్నీ, రాజమౌళికి థాంక్స్. ఇండస్ట్రీకి శివుడి లాంటి మనిషి బాలయ్య. బాలయ్య ఎంతో ఆధ్యాత్మికం. లాస్ట్ 48 రోజులు అఖండ కోసమే పని చేస్తున్నాను. కాశీకి వెళ్లిపోయిన ఫీలింగ్ వచ్చింది. బాలయ్య ట్రాన్స్ఫార్మర్ అయితే.. ఆయనకు కరెక్ట్ వోల్టెజ్ కరెంట్ ఇచ్చేది బోయపాటి.
నేను నా కెరీర్లో వాయించింది ఫస్ట్ సినిమా భైరవ దీపం. అప్పుడు నాకు 30 రూపాయలు. అఖండ సంగీతం అందించినందుకు రుణపడి ఉన్నాను. నాకు దేవున్ని చూస్తున్నట్టే ఉంది. ఇంకా అఖండ ట్రాన్స్లోనే ఉన్నాను. థియేటర్లో సినిమా చూసేటప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు.
నేను ఇది వరకు ఎన్టీఆర్తో పని చేశాను. బృందావనం, రామయ్య వస్తావయ్య, బాద్ షా, అరవింద సమేత ఇలా సినిమాలు చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్ద ఎన్టీఆర్ పనిచేసిన ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం అని అన్నారు. ఈ చిత్రంలో మాస్ నంబర్ చేసే చాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన పాటను కరోనా సమయంలోనే చేశాం. నేను బోయపాటి గారు కలిసి ఆ పాటను చేశామని అన్నాడు.
[ad_2]
Source link