[ad_1]
ప్రధానాంశాలు:
- భీమ్లా నాయక్ రీ షూట్
- సంక్రాంతి బరిలోకి భీమ్లా నాయక్
- పవన్, రానా హీరోలుగా రూపొందుతోన్న చిత్రం
డైరెక్టర్ సాగర్ కె.చంద్ర డైరెక్ట్ చేసిన తర్వాత ఔట్పుట్ చూశాడట పవన్ కళ్యాణ్. ఆయనకు ఎందుకనో అంత శాటిస్పాక్షన్గా అనిపించలేదు. దీంతో రీ షూట్ చేయాలని దర్శక నిర్మాతలకు చెప్పారట. పవన్ కళ్యాణ్ రేంజ్ హీరో చెబితే వినకపోతే ఎలా! ఇప్పుడు భీమ్లా నాయక్ను ఆగ మేఘాల మీద రీ షూట్ చేస్తున్నారనేది టాక్. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్కు ఇది తెలుగు రీమేక్. పవన్కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. భీమ్లా నాయక్గా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, డానియల్ శేఖర్గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్కు మధ్య జరిగే ఈగో క్లాషెష్ ఈ సినిమా. తెలుగు నెటివిటీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను బేస్ చేసుకుని త్రివిక్రమ్ కథలో మార్పులు చేర్పులు చేసి దానికి తగినట్లు డైలాగ్స్ రాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఏం చేద్దాం. మరోసారి రీ షూట్ చేయాల్సి వచ్చింది.
సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలంటే వీలైనంత త్వరగానే పూర్తి చేయాలని యూనిట్ అంతా పరుగులు తీస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జోడిగా నిత్యామీనన్ నటిస్తే.. రానా దగ్గుబాటి జోడిగా సంయుక్తా మీనన్ నటించింది. సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు పవన్ కళ్యాన్ క్యారెక్టర్, రానా దగ్గుబాటి క్యారెక్టర్స్కు సంబంధించిన ప్రోమోలు, గ్లింప్స్, మూడు పాటలు విడుదలై మంచి ఆదరణను దక్కించుకున్నాయి.
[ad_2]
Source link