తేమకు గురికావడం అనేది పోషకాలను తగ్గించి మీ ఆహారాన్ని బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములకి సంతానోత్పత్తి చేసే మరో తప్పు. కాబట్టి, మీరు ఆహారాన్ని వెంటనే క్లీన్ ఫిల్మ్ లేదా ఫాయిల్తో కప్పి ఉంచడం మంచిది.
కచ్చితమైన విధంగా మసాలాలు వేయడం వల్ల మీ పోషకాహారాన్ని తయారు చేయొచ్చు. ఇవి సరిగ్గా వేయకపోవడం వల్ల పోషకాలను పోగొట్టినవారవుతారు. అవును, మసాలాలు.. వంట చేసేటప్పుడు వేస్తారు. కొన్ని వంటల్లో చివరిగా వేస్తారు. ఎందుకంటే, అవి వేడికి త్వరగా వాటిలోని పోషకాలు పోతాయి. కాబట్టి, మీరు మిరియాలు, పసుపు, మసాలా దినుసులని సరిగ్గా వేయాలని గుర్తుంచుకోండి.
Also Read : Shower Romance : షవర్ చేస్తూ హస్తప్రయోగం..
వండేందుకు ఒక రాత్రి ముందు కూరగాయలు, పండ్లని కట్ చేయడం మానేయండి. ఇది బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములు సంతానోత్పత్తికి దారి తీస్తుంది. ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది మీ సమయాన్ని చాలా వరకూ సేవ్ ఇస్తుంది. కానీ, ఇది తాజా కూరగాయలు, పండ్లలోని పోషకాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కోత కూడా ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది. దీంతో ఫ్రెష్ ప్రోడక్ట్స్ కుళ్ళిపోతుంది.
కూరగాయలు, మాంసాలు ఎక్కువగా వండటం వల్ల క్రిములు చనిపోతాయని ఓ అపోహ ఉంది. అయితే, ఈ కారణంగా పోషకాలు కూడా నాశనమవుతాయి. అవును ఎక్కువగా ఉడికించడం వల్ల పోషకాలన్నీ కరిగిపోతాయి. కేలరీలు వస్తాయి. అయినప్పటికీ, క్యారెట్, పుట్టగొడుగులు, బచ్చలికూర, కూరగాయలు, ఆకుకూరలు వండినప్పుడు ఎక్కువ పోషకమైనవి వాటి పోషకాలు పెరుగుతాయి. కానీ, మిగతవాటిని ఎక్కువగా వండడం వల్ల పోషకాలు తగ్గుతాయి.
Also Read : Fatty liver : ఈ లక్షణాలు ఉంటే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
- Read More : Relationship News and Telugu News