[ad_1]
శొంఠి మన డైట్లో చేర్చుకుంటే. మన ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యురాలు రేఖా రాధామని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. శొంఠిని హీరోగా అభివర్ణించారు. ఘాటుగా ఉండే శొంఠి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
గ్యాస్ సమస్య దూరమవుతుంది..
తాజా అల్లం వాతాన్ని పెంచుతుంది, శొంఠి వాతాన్ని సమతుల్యం చేస్తుందని డా. రేఖా రాధామని అన్నారు. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే.. గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి వేసుకుని తాగితే.. ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి దీర్ఘకాలిక అజీర్ణం వల్ల కడుపు నొప్పి , కడుపులో అసౌకర్యం నుంచి ఉపశమనం ఇస్తుంది.
మలబద్ధకానికి చెక్..
శొంఠి పొడి క్రమం తప్పకుండా మీ డైట్లో చేర్చుకుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శొంఠిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు శొంఠి సహాయపడుతుంది. ఉదయాన్నే బౌల్ కదలికలు కష్టంగా ఉంటే.. గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి కలిపి తీసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది.
జలుబుకు ఔషదం..
ఈ రోజుల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. శొంఠి కఫాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శొంఠి నీరు తీసుకుంటే జలుబు, దగ్గు దూరమవుతాయి. ఫూ సమస్యతోనూ పోరాడటానికి శొంఠి సహాయపడుతుంది. ఈ రోజుల్లో శొంఠి మీ డైట్లో చేర్చుకుంటే ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటివి దరిచేరవు.
ఇమ్యూనిటీ పెరుగుతుంది..
శొంఠిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఎలా తీసుకోవాలి..?
శొంఠిని కషాయంగా చేసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని డా. రేఖ అన్నారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు తీసుకుని, 1 చిటికెడు శొంఠి పొడి వేసి మరిగించండి. దానిలో 1 గ్లాసు నీరు మిగిలే వరకు మరిగించాలి. ఆ తర్వాత దించి.. గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి.
[ad_2]
Source link