[ad_1]
‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పూర్తి చేసిన రామ్చరణ్ ఆ వెంటనే పాన్ ఇండియా రేంజ్లో సినిమా చేయాలనుకుని శంకర్తో చేతులు కలిపారు. తెలుగు నిర్మాతలు దిల్రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించడానికి రెడీ అయ్యారు. వీరు నిర్మిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. రామ్చరణ్ 15వ సినిమా ఇది. ఇందులో రామ్చరణ్ను సరికొత్త లుక్తో, క్యారెక్టరైజేషన్తో శంకర్ ప్రెజెంట్ చేయబోతున్నారు. కలెక్టర్గా, మరో వేరియేషన్లో ముఖ్యమంత్రిగా రామ్చరణ్ కనిపించబోతున్నారట.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సాధారణంగా శంకర్ సినిమా అంటే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అనొచ్చు. మరి పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాతో శంకర్ ఎలాంటి సంచనాలకు తెర తీయబోతున్నారో చూడాలి.
[ad_2]
Source link