Home తెలుగు News ఆరోగ్యం world immunization week 2022: World Immunization Week :వ్యాక్సిన్‌తో ఆరోగ్యం పాడవుతుందా.. – world immunization week know here all details about this

world immunization week 2022: World Immunization Week :వ్యాక్సిన్‌తో ఆరోగ్యం పాడవుతుందా.. – world immunization week know here all details about this

0
world immunization week 2022: World Immunization Week :వ్యాక్సిన్‌తో ఆరోగ్యం పాడవుతుందా.. – world immunization week know here all details about this

[ad_1]

ఎంతో ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దానికి వ్యాక్సినేషన్ ఎంతో అవసరం, అంటే వ్యాక్సినేషన్ ద్వారా కృత్రిమంగా రోగ నిరోధక శక్తిని పెంచే ప్రక్రియని ఇమ్యునైజేషన్ అంటారు. అయితే ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌లను తీసుకోవడం ఎంతో అవసరం.

అందుకోసం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్‌ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నుండి 30 వరకు జరుపుకుంటారు. దీనిలో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునిసెఫ్, మరియు ఇతర సంస్థలు ఈ వారాన్ని ఇరాక్‌లో జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం ఒకే అంశం మీద ఈ కార్యక్రమం జరగదు. ఈ సంవత్సరం అయితే వ్యాక్సిన్‌లు మనల్ని అందర్నీ మరింత దగ్గరగా చేశాయి అనే అంశాన్ని తీసుకున్నారు అంటే ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం అనే దాని గురించి చర్చిస్తారు. అయితే దేశ స్థాయిలో అయితే వ్యాక్సినేషన్ కీలక పాత్ర గురించి చెబుతారు.
పెళ్ళి చేసుకుంటానని అలా చేశాడు.. ఏం చేయను..
ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలి అని నిర్వహిస్తున్నారు. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అన్ని వయసు గలవారి ఆరోగ్యం బాగుండాలి అని వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ తీసుకొని వివిధ రకాల వ్యాధుల నుండి బయటపడాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇమ్యునైజేషన్ వల్ల లక్షల మంది ప్రాణాలు ప్రతి సంవత్సరం కాపాడుకోవచ్చు.

వ్యాక్సిన్‌లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎన్నో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించిన తర్వాతే సామాన్య ప్రజలు అందరికీ ఇస్తారు అని గుర్తుంచుకోండి. చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని పైగా వారి ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది అని భావిస్తారు. అయితే ఇది చాలా పెద్ద అపోహ, కాబట్టి వ్యాక్సిన్‌లను తీసుకోడానికి ఎటువంటి అనవసరమైన ఆలోచనలు చేయొద్దు.

వ్యాక్సిన్ లు చాలా సురక్షితం అని గుర్తుంచుకోండి. చాలా దేశాల లో సరైన సంఖ్యలో వ్యాక్సిన్‌లను అందించలేదని ప్రభుత్వాలు బాధ పడుతున్నాయి. అయితే మరి కొన్ని దేశాలలో ప్రజలు భయపడి వ్యాక్సిన్లను తీసుకోవట్లేదు. ఇప్పటికీ ఇరాక్‌లో కావాల్సినన్ని వ్యాక్సిన్లు ప్రజలకు అందలేదు దానివల్ల చాలా మంది మహమ్మారి వ్యాక్సిన్ వేయించుకోలేదు.

మన ప్రాణానికే ప్రమాదం అయినటు వంటి వ్యాధుల నుండి కాపాడుకోవడానికి రెండు వందల సంవత్సరాల నుండి వ్యాక్సిన్‌లను ఉపయోగిస్తున్నారు. వ్యాక్సిన్‌లను కనుక్కోకపోతే చాలా సమస్యగా మారేది. పూర్వం పోలియో, స్మాల్ పాక్స్ వంటి వ్యాధులకు ఎలాంటి వ్యాక్సిన్‌లు లేవు. దాని వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.

వ్యాక్సిన్

ముఖ్యంగా కమ్యూనికేబుల్ డిసీజెస్ అయితే ఒక వ్యాధి సోకితే అది అందరి పై ప్రభావం చూపేది. పైగా వ్యాక్సిన్‌లు లేని సమయంలో ట్రీట్మెంట్ కూడా సరిగ్గా చేసే వారు కాదు. అందరి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అని ట్రీట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. దాని వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఇదే పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి అసలు అలా లేదు.

కాక పోతే కొద్ది శాతం మంది వ్యాక్సిన్‌లను తీసుకోవడానికి భయపడుతున్నారు అని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2021 లో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆత్మీయులకు మరియు స్నేహితులకు దూరంగా ఉండడం కేవలం ఫోన్ కాల్స్ మరియు వీడియో కాల్స్ లోనే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది.
Parenting Tips : పిల్లలకి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకనిపిస్తుందంటే..
మీకు కావాల్సిన వారికి కోవిడ్-19 సోకినా అదే పరిస్థితి ఉండేది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత కొంత మార్పు వచ్చింది, 2021 లో జరిగిన క్యాంపెయిన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ నమ్మకం మరియు ధైర్యం ఏర్పడింది. దాంతో అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకొచ్చారు.

వైరస్ కారణంగా ఇరాక్‌లో ఇతర వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్‌లు చిన్న పిల్లలకి ఇవ్వడం జరగలేదు. దాంతో ఎంతో ప్రమాదకరమైన వ్యాధులు పోలియో, మీసెల్స్ మొదలైనవి సోకాయి. నిజానికి 2020లో లక్షా అరవై వేల మంది పిల్లలకు మీసెల్స్‌కు సంబంధించిన వాక్సినేషన్ జరగ లేదు. ఈ విధంగా ఇరాక్ లో పిల్లల ఆరోగ్యం దెబ్బతింది.

అందుకోసం డబ్ల్యూహెచ్వో, యునిసెఫ్ మరియు ఇరాక్‌కు సంబంధించిన సంస్థలు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనమని అందరిని ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలలో అవగాహన కలుగుతుంది మరియు దాంతో చిన్న పిల్లల నుండి పెద్ద వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సమాజంలో ఎటువంటి రోగాలు లేకుండా ఉంటాయి.

అయితే ప్రస్తుతం ఇరాక్‌లో డబ్ల్యుహెచ్వో, యూనిసెఫ్ మరియు హెల్త్ మినిస్ట్రీ యొక్క సహాయం తీసుకుని ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలు కొనసాగాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ముసలివారు మరియు దీర్ఘకాలిక సమస్యల తో బాధ పడే వారికి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలు పూర్తయ్యాయి. కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌లతో పాటు వారికి సంబంధించిన అన్ని వాక్సినేషన్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. దాంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్నారు.
Strength Training : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే బీపి తగ్గుతుందట..
అయితే కృత్రిమంగా వాక్సినేషన్ చేయించుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాము, మరి సహజంగా రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి…?

  • రోగ నిరోధక వ్యవస్థ మెరుగుగా పని చేయాలి అంటే సహజంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు మరియు నట్స్ వంటి వాటితో అత్యధికమైన పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ను పొందవచ్చు. కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే హానికరమైన ప్యాతోజెన్స్ కు వ్యతిరేకంగా పోరాడగలతాయి. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండేటటు వంటి ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోండి. నిమ్మ జాతికి చెందిన పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
  • ఆహారం ఎంత తీసుకున్నా సరే సరైన నిద్ర కూడా ఎంతో అవసరం అని గుర్తుంచుకోవాలి. పెద్ద వారికి 7 గంటలు లేక అంత కంటే ఎక్కువ సేపు నిద్ర అవసరం. అయితే యుక్త వయస్సులో ఉన్న వారికి ఎనిమిది నుండి పది గంటల వరకు మరియు చిన్న పిల్లలకు 14 గంటల వరకు నిద్ర అవసరం. సరైన నిద్ర ఉంటేనే పూర్తి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
  • నిద్రపోయే ముందు టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్ మరియు మొబైల్ ఫోన్ ద్వారా వచ్చే బ్లూ లైట్ కు దూరంగా ఉండండి.
  • కేవలం ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు మాత్రమే తీసుకోండి. ఆలివ్ ఆయిల్ మరియు సాల్మన్ చేపల లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. అంతే కాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా వాటితో తగ్గుతుంది.
  • ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఆరోగ్యం నిద్రతో పాటు మంచి నీరును తీసుకోవడం కూడా ఎంతో అవసరం అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి. మంచి నీటిలో ఎటువంటి క్యాలరీలు, ప్రిజర్వేటివ్స్ మరియు పంచదార ఉండదు కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదు. రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల వరకు మంచి నీరుని తీసుకో వచ్చు.
  • మీ ఉద్యోగం వల్ల లేక ఇతర కారణాల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. మెడిటేషన్ చేయడం, యోగా మరియు ఇతర శారీరక వ్యాయామాలను చేయడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • మీరు ఆహారం లో ఎన్ని మార్పులు చేసుకున్నా మీ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండక పోతే కచ్చితంగా మీరు సప్లిమెంట్స్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. అయితే సప్లిమెంట్స్ ను తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించి వారి సూచనల మేరకు సప్లిమెంట్స్ ను తీసుకోండి.
  • ఇలాంటి మార్పులు మీ డైలీ రొటీన్ లో చేసుకొని రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. దీనితో మీరు ఆరోగ్యంగా ఉండచ్చు. అలానే అనారోగ్య సమస్యల ముప్పు కూడా మీకు కలగదు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here