Home తెలుగు News సినిమా Aadavaallu Meeku Joharlu : రాజమండ్రిలో రష్మిక.. శర్వాతో కలిసి అలా

Aadavaallu Meeku Joharlu : రాజమండ్రిలో రష్మిక.. శర్వాతో కలిసి అలా

0
Aadavaallu Meeku Joharlu : రాజమండ్రిలో రష్మిక.. శర్వాతో కలిసి అలా

[ad_1]

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు రాజమండ్రిలో అడుగుపెట్టింది. ఇక కలిసి ముచ్చట్లు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ అప్డేట్ ఇచ్చేసింది. ఈ ఇద్దరి కాంబోలో అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

నేడు (అక్టోబర్ 24) ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం షూటింగ్‌ను చిత్రయూనిట్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ దాదాపు నటీనటులంతా కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌తో దాదాపు టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి కానుంది. దసరా కానుకగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా అది ఫుల్ వైరల్ అయింది. శర్వానంద్, రష్మికలు నవ్వుకుంటూ ఎదురెదురుగా నిల్చున్న ఆ పోస్టర్‌కు అంతా ఫిదా అయ్యారు.

ఇక ఇప్పుడు రాజమండ్రిలో మొదలుపెట్టిన ఈ షెడ్యూల్‌లో దాదాపు చితయూనిట్ అంతా కూడా పాల్గొంటుందట. ఈ సినిమాలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. రష్మిక ఈ చిత్రంతో పాటుగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తోంది. ఇక శర్వానంద్ ఒకే ఒక జీవితం అంటూ రాబోతోన్నాడు. ఇటీవల మహా సముద్రంతో వచ్చిన శర్వాకు నిరాశే ఎదురైంది.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here