[ad_1]
వివిధ జీర్ణక్రియ వాతావరణాలు ఉన్న ఆహార పదార్థాలను వేర్వేరుగా తినాలని ఆయుర్వేద వైద్యురాలు నితికా కోహ్లి అన్నారు. మీరు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. జీర్ణక్రియ ఒకే రకంగా ఉన్న ఫుడ్ కాంబినేషన్స్ తింటే మంచిదని అన్నారు. ఆహార పదార్థాల జీర్ణక్రియలో తేడా ఉంటే.. విరామం ఇచ్చి తినడం మేలని డా.నితికా కోహ్లి అన్నారు.
ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆహార పదార్థాలు కలిపి తీసుకున్నప్పుడు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపితే దాన్ని కాంట్రాస్ట్ డైట్ అంటారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. కాంట్రాస్ట్ డైట్ నిరంతరం తీసుకుంటుంటే.. అంధత్వం, రక్తహీనత, చర్మ వ్యాధులు, సంతానలేమి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాంట్రాస్ట్ డైట్ ఎక్కువగా కాలం తీసుకుంటే మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ ఆహారాలు కలిపి తినొద్దు..
చేప + పాలు
చికెన్ + పాలు
పాలు+అరటిపండు
దానిమ్మ + ద్రాక్ష
గ్రీన్ టమాటా + వైన్
బంగాళదుంప+ అల్కహాల్
పాలు+ఉప్పు
పాలు, చికెన్ ఒకేసారి ఎందుకు తీసుకోకూడదు..?
కాంట్రాస్ట్ డైట్ గురించి చెబుతూ డా. కోహ్లీ.. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేశారు. పాలను చికెన్తో, ఇతర మాంసాహారంలో కలపడం మంచిది కాదని డా. కోహ్లీ అన్నారు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్కు భిన్నంగా ఉంటుందని.. పాలు, చికెన్ కలిపి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఇది జీర్ణప్రక్రయకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ ఎక్కువకాలం తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎంత గ్యాప్ ఇవ్వాలి..
చికెన్ తిన్న తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చి పాలు తాగితే మంచిదని డా. కోహ్లీ అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలిని, కాంట్రాస్ట్ డైట్కు దూరంగా ఉండాలని సూచించారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link