[ad_1]
ప్రధానాంశాలు:
- పుష్ప నుంచి డిలీటెడ్ సీన్ రిలీజ్
- పుష్ప డిలీటెడ్ సీన్కి హ్యూజ్ రెస్పాన్స్
- డిలీటెడ్ సీన్కే 1 మిలియన్ వ్యూస్
సినిమాలో మిల్లులో పనిచేయడానికి వెళ్లిన పుష్ప (అల్లు అర్జున్) అక్కడ యజమానిని చూసి భయపడకపోవడం.. ఆ కారణంగా పని నుంచి బయటకు వచ్చేయడం సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత సీన్ను కూడా సుకుమార్ చిత్రీకరించారు. కానీ సినిమా ఎడిటింగ్లో కత్తిరించేశారు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని రిలీజ్ చేశారు. రెడ్డప్ప అనే వ్యక్తి పుష్ప తల్లి దగ్గరకు వచ్చి ఇచ్చిన అప్పును వడ్డీతో సహా కట్టమని అడుగుతాడు. నా కొడుకు మిల్లులో పనికి చేరాడు. కట్టేస్తామని ఆమె చెప్పినప్పుడు మీవాడు పని ఎప్పుడో మానేశాడని అంటాడు.
అప్పుడు తల్లి పుష్పను ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. తర్వాత ఇంట్లోని గేదెను అమ్మేసి వచ్చిన డబ్బుల్లో అప్పిచ్చిన సదరు రెడ్డెప్పకు అసలు వడ్డీ ఇచ్చేయడం.. అతను వెళ్లిపోతుంటే నీ లెక్క సరిపోయింది. మరి నా లెక్కో అంటూ ప్రశ్నించి రేషన్ షాపు ముందు మా అమ్మను తిడుతుంటే 120 మంది చూశారు. వారందరి ఇంటికెళ్లి అప్పును పుష్ప ఇచ్చేశాడని చెప్పాలని అంటూ అతన్ని కొట్టుకుంటూ వెళతాడు. ఆ సీన్ను సుకుమార్ డిలీట్ చేశారు.
అల్లు అర్జున్ ‘పుష్ప’ డిలీటెడ్ సీన్
డిలీట్ చేసిన సదరు సీన్ను ఇప్పుడు రిలీజ్ చేస్తే యూట్యూబ్లో అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఎంత పెద్ద రెస్పాన్స్ అంటే.. విడుదల చేసిన డిలీట్ సీన్కే ఏకంగా 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 75 వేలు లైక్స్ వచ్చాయి. ఒక డిస్ లైక్ కూడా రాకపోవడం విశేషం. మరి ఇంకా పుష్ప ది రైజ్ నుంచి ఎన్ని డిలీట్ సీన్స్ రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప ది రూల్ చిత్రాన్ని ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ చేయబోతున్నారు.
[ad_2]
Source link