[ad_1]
2009లో గిల్లి అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా కెరీర్ను స్టార్ట్ చేసిన రకుల్ ఆ వెంటనే తెలుగుకి షిఫ్ట్ అయ్యింది. నటిగా తనదైన గుర్తింపును సంపాదించుకుంటూ తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంంటూ వచ్చింది. కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో మహేశ్, ఎన్టీఆర్, రామ్చరణ్ వంటి అగ్ర హీరోలందరితో దాదాపు నటించారు. అలాగే ఆమె ఓవైపు సినిమాలు, మరో వైపు ఫిట్నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా కూడా ఉంది. ఎఫ్ 45 అనే జిమ్ సెంటర్ను కూడా రకుల్ నిర్వహిస్తోంది. అలాగే వీలునప్పుడల్లా సోషల్ మీడియాలోనూ తన ఫిట్నెస్ రహస్యాలు, యోగ గురించి చెబుతూ యాక్టివ్గా ఉంటుంది. రీసెంట్గా ఆమె వైష్ణవ్ తేజ్తో నటించిన కొండపొలం చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో రీసెంట్గా ఆమె నటించిన కొండపొలం మాత్రమే విడుదలైంది.
[ad_2]
Source link