[ad_1]
ప్రధానాంశాలు:
- రాష్ట్రపతి కావాలనే ఉద్దేశం లేదన్న వెంకయ్య నాయుడు
- రాజకీయాలకు దూరమై చిరంజీవి మంచి పనిచేశారు
- రాజకీయాలపై ఆసక్తి తగ్గిందన్న వెంకయ్య నాయుడు
- నేటి రాజకీయాలు బాగోలేవని వ్యాఖ్యలు
ఇప్పుడు నాకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పటి రాజకీయాలు అంత పరిమళంగా లేవు. చిరంజీవి రాజకీయాలు మానుకుని కళామతల్లికి మళ్లీ సేవ చేస్తుండటం మంచి పనైంది. మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ బాగుపడతాయి. చూడటానికి కూడా తను బావున్నాడు. రాజకీయం ఇంతకు ముందున్నంత ఆరోగ్యంగా లేదు. నేను ఎక్కువగా మాట్లాడి రాజకీయ నాయకులను అవమాన పరచడం నాకు ఇష్టం లేదు. అందరూ అలా లేదు. కానీ కొద్ది మంది అయినా జనం ఎక్కువగా చూస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు భాష వింటుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం కూడా అక్కడ నుంచే వచ్చాం కదా!. జబ్బులాగా ఇది పెరుగుతూ వస్తుంది. దీన్ని సంస్కరించాలంటే ప్రజల్లో నుంచి ఆ మార్పు రావాలి’’ అన్నారు.
ఈ కార్యక్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ ‘ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుగారు దేశానికి సేవ చేశారు. ఆయన తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనం, నిర్వచనం. ఓ తెలుగువాడిగా నాకే కాదు, అందరికీ ఆయన రాష్ట్రపతి కావాలనే ఉంది. తెలుగువారందరూ గర్వించేలా వెంకయ్యనాయుడగారు అయ్యప్ప స్వామి సాక్షిగా రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. యోధ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు సహా చిరంజీవి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, అజహరుద్దీన్, పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.
చిరంజీవి పొలిటికల్ విష్… వెంకయ్య నాయుడుని అలా చూడాలనుందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్
[ad_2]
Source link